calender_icon.png 14 June, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలసొచ్చి.. వనం పొతం పెట్టి!

14-06-2025 12:17:03 AM

  1. గొత్తి కోయల ఆక్రమణలో 26 వేల ఎకరాల అటవీ భూములు 
  2. స్వాధీనం చేసుకుని మొక్కలు నాటేందుకు అధికారుల యత్నం
  3. ఆక్రమిత భూముల్లోకి వెళ్తే దాడులు
  4. ఏజెన్సీ ప్రాంతంలో యుద్ధవాతావరణం

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 13 (విజయ క్రాంతి) వానాకాలం వచ్చిందంటే అటవీ శాఖ అధికారులకు వృత్తి కత్తి మీద సామే అని చెప్పాల్సిందే. రాష్ట్రంలోనే అత్యధిక అ టవీ ప్రాంతం గల భద్రాద్రి కొత్తగూడెం జి ల్లాలో చతిస్గడ్ నుంచి వలస వచ్చిన గుత్తి కోయల ఆక్రమణలో సుమారు 26 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. ఆక్రమిత భూ ములను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో అటవీశాఖ అధికారులు, ఆక్రమించిన భూ ములను రక్షించుకొనే ప్రయత్నంలో గుత్తి కాయలు ఉండటంతో అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

అటవీ శాఖ అధికారుల తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 26, 688 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలింది. కొత్తగూడెం ఇల్లం దు పాల్వంచ మణుగూరు భద్రాచలం కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ డివిజన్లో దట్ట మైన అడవులను గుత్తి కాయలు ఆక్రమించి చెట్లను నరికి పోడు వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వానాకాలం ప్రారంభం కావడంతో అటవీశాఖ అధికారులు హరితహారం పేరుతో ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకొని మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతున్నారు.

మరోవైపు పోడు భూముల్లో సేద్యం చేసుకున్నం దుకు గొత్తికాయలు ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. దీంతో అటవీ ప్రాంతాల్లో ఉ ద్రిక్త వాతావరణం నెలకొననుంది. అడవుల నరికివేత పై సీరియస్ గా ఉన్న ఉన్నతాధికారులు, అడవుల పునరుద్ధరణకు మొక్కలు నాటాలని ఆదేశిస్తుండటంతో ఫారెస్ట్ సిబ్బందిపై గుత్తి కోయాల దాడులకు పాల్పడుతు న్నారు.

దీంతో జిల్లా అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. 2022 అక్టోబర్ నెలలో పోడు భూములను స్వాధీనం చేసుకునే క్ర మంలో చండ్రుగొండ మండలంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గుత్తి కో యలు హత్య చేసిన సంఘటన నెలకొంది.

చతిస్గడ్ నుంచి బతుకుతెరువు కోసం తెలంగాణకు వచ్చిన గుత్తి కాయలు ప్రజలు ఫారెస్ట్ లో నివాసం ఏర్పరుచుకున్నారు. ద ట్టమైన అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి పో డు భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఇటీవల అటవీశాఖ అధికారులు నిర్వహిం చిన ప్రాథమిక సర్వేలో జిల్లాలోని కొత్తగూడెం ఇల్లెందు పాల్వంచ మణు గూరు భద్రాచలం కిన్నెరసాని వ న్యప్రాణి సంరక్షణ విభాగాల్లో 123 హ్యాబిటేషన్లలో, 3,653 కుటుంబాలకు చెందిన వారు 26 వేల 688 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు నిర్ధారణ అయింది.

చతిస్గడ్ లో మా వోయిస్టు, పోలీస్ వర్గాల మధ్య నెలకొ న్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా పెద్ద సంఖ్యలో గుత్తి కోయలు సరిహద్దు రాష్ట్రమై న తెలంగాణకు వలస వచ్చి అటవీ ప్రాంతాలను ఎంచుకున్నారు. తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకొని చెట్లను నరికి పోడు సాగు చేస్తూ జీవిస్తున్నారు. వలస వాదనవల్ల దట్టమైన అటవీ ప్రాంతం ప్రస్తుతం పలుచబడిపోయింది.

దీంతో వాతావరణ సముతల్యం కోసం ప్రభుత్వం చేపట్టిన హరితహారం లో భాగంగా ఆక్రమిత అటవీ భూ ములను స్వాధీనం చేసుకొని మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాలని అటవీశాఖ ఉన్నతాధికారులు ఫారెస్ట్ సిబ్బందికి లక్ష్యాలను నిర్ధారించారు. ఏ క్రమంలో ఫారెస్ట్ సిబ్బంది ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే గుత్తి కోయలు దాడులకు పాల్పడుతున్నారు.

తాజాగా చెంచుపల్లి మం డలంలో సర్వేకు వెళ్లిన అటే శాఖ సిబ్బందిపై దాడులకు పాల్పడిన సంఘటనతో అటవీశాఖ అధికారులు అడవిలోకి వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. 

సమన్వయంతో పని చేస్తేనే సాధ్యం 

ఆక్రమిత అటవీశాఖ భూములను స్వాధీనం చేసుకోవాలంటే పోలీస్ ఐటిడిఏ ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే సాధ్యమవుతుంది. శాఖల మధ్య సమన్వయం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఐటీడీఏ, ఇతర శాఖల అధికారులు గొత్తి కోయలకు సరుకులు సోలార్ లైట్లు, బోర్లు, ఇతర పరికరాలు అందజేస్తున్నారు. పోలీస్ అధికారులు ఆవాస ప్రాంతా లకు మౌలిక వసతుల కల్పనతో పాటు, వారి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

దీంతో అటవీ శాఖ అధికారుల కు వలస ఆదివాసి గిరిజనులను తెప్పి పంపించడం కత్తి మీద సాముగా మారింది. ఈ క్రమంలోనే అటవీశాఖ అధికారులపై గుత్తి కాయలు దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకొని అడవులను పున రుద్ధరించాలంటే మూడు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.