21-06-2025 01:50:51 AM
ఎల్లారెడ్డిపేట: జూన్ 20 (విజయక్రాంతి ) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం పదిరా గ్రామానికి చెందిన ఓ ఇసుక ట్రాక్టర్ ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లో వెళ్లడంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారి భయ భ్రాంతులకు గురయ్యారు.
రోజుకో ప్రమా దం జరిగిన ఇసుక ట్రాక్టర్ యజమానులకు భయం లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. దీనిపైన రెవెన్యూ అధికారులు పోలీస్ లు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులుఅంటున్నారు.