calender_icon.png 21 June, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్రమశిక్షణ, పట్టదలతో చదువుకోవాలి

21-06-2025 01:46:44 AM

  1. పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి

సొంత ఖర్చులతో స్టూడెంట్స్‌కు నోట్ బుక్కులు, పెన్సీల పంపిణీ

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 20: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టదలతో చదువుకోవాలని పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి అన్నారు.  పసుమానులలోని ప్రాథమిక పాఠశాలలో ఆయన సొంత ఖర్చులతో విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులు పెన్సీలు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలంటిన్నీ పరిష్కారించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో  శంకరయ్య గౌడ్, సర్పల్లి నర్సింగరావు, పాడి జంగయ్య, నాయకులు బక్కి యాదయ్య గౌడ్, పర్వత్ శ్రీనివాస్ రెడ్డి, చిట్టి రాజు గౌడ్, సంఘీ బిక్షపతి, కూతాడి మల్లేష్, బండ్లగూడెం వెంకటేష్ గౌడ్, కాటం భాస్కర్ గౌడ్, చర్లపల్లి బాబుగౌడ్,  గూడపు దర్శన్ గౌడ్, కొత్తపల్లి సందీప్ రెడ్డి, ఏల మధుసూదన్, గగనం శేఖర్, బండ్లగూడెం రాజు, చెవుల మణికిరణ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.