పరిశుభ్రతే ప్రధానం
- 56వ డివిజన్లో పారిశుధ్య కార్యక్రమం
- పర్యవేక్షించిన కార్పొరేటర్ శాంతిప్రియ
కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రజాపాలనలో కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 56వ డివిజన్ వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలకు నిర్వహించారు. డివిజన్ వ్యాప్తంగా ఉన్న కాల్వలను కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. అదే విధంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా శాంతిప్రియ మాట్లాడుతూ... పరిశుభ్రతే ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా కాల్వలను శుభ్రం చేయించడం ద్వారా దోమల బెడద తప్పుతుందని చెప్పారు.
డివిజన్ వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు అనునిత్యం నిర్వహిస్తూ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. డివిజన్లో ఏ సమస్య తలెత్తినా తనను నేరుగా సంప్రదించాలని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ సంధ్య, జవాన్ నవీన్, 56వ డివిజన్ కార్యదర్శి గడ్డం సతీష్ బాబు, రమాదేవి, శారద తదితరులు పాల్గొన్నారు.




