17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్

01-11-2025 12:00 AM

సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ బాబు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31: దేశాన్ని ఐక్యం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి శేఖర్ బాబు అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నేషనల్ యూనిటీ డేని ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా శేఖర్ బాబు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్  దేశంలో 526 సంస్థానాలను ఏకం చేసి ఒకే భారత దేశంగా ఉండడానికి కృషి చేసి ఉక్కుమనిషిగా పిలవబడ్డారన్నారు. పటేల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత దేశ ఐక్యమత్యానికి జాతీయ సమైక్యతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్  కండె శ్రీనివాస్  కీర్తివర్ధన్, రఘు, భరణి సేతుపాండియన్, హెచ్ ఓ డి లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.