24 June, 2026 | 2:17 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

శివంపేటలో రన్ ఫర్ యూనిటీ 2కె ర్యాలీ!

31-10-2025 11:15 PM

ఎస్సై చల్ల మధుకర్ రెడ్డి!!

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలో ఎస్సై చల్లా మధుకర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రన్ పర్ యూనిటీ 2  కే ర్యాలీ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు పోలీస్ స్టేషన్ నిలయం ముందు నుండి ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం శివంపేట మండల ఎస్సై  మధుకర్ రెడ్డి మాట్లాడుతూ మనమంతా కలసి దేశా ఐక్యత, సోదర భావం, ఆరోగ్య జీవన విధానం పట్ల జాగ్రత్తతో నడిచే సమాజం సృష్టించుకుందాం మనమందరం మన దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని   ఎస్సై మధుకర్ రెడ్డి  ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా, జిల్లా కార్యవర్గ సభ్యులు, చింతల కర్ణాకర్ రెడ్డి,  ,  మండల మైనార్టీ యువ నాయకులు షేక్ అలీ, శివంపేట గ్రామ యువకులు, మరియు పోలీస్ సిబ్బంది, శివంపేట ఎస్టివసతి గృహం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.