16-06-2025 01:07:54 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): తెలంగాణ తొలి ఆర్టీసీ (ప్రైవేట్ అద్దె బస్సు) మహిళా డ్రైవర్గా సరిత కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారా యణపురం మండలం సిత్యాతండాకు చెంది న వాంకుడోత్ సరిత గతంలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పదేళ్ల పాటు డ్రైవర్గా విధులు నిర్వర్తించారు. తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా కొంతకాలం క్రితం ఆమె స్వరాష్ట్రానికి వచ్చారు.
ప్రైవేట్ బస్సుల నిర్వహణను చూసుకునే జేబీఎం అనే ప్రైవేటు సంస్థ ఆమెకు తెలంగాణలో డ్రైవర్గా కొలు వు ఇచ్చింది. ఈనెల 14న మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలో ఆమె రిపోర్ట్ చేసి విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆమె మిర్యాలగూడ - హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు నడుపుతున్నారు.
తాను 2015లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్లో తొలి మహిళా బస్సు డ్రైవర్గా చేరానని, అప్పటి నుంచి 2023 వరకు మరో మహిళెవరూ అక్కడ డ్రైవర్గా విధులు నిర్వర్తించలేదని సరిత ‘విజయక్రాంతి’కి తెలిపారు. ప్రస్తుతం అక్కడి ప్రజార వాణావ్యవస్థలో 100 మంది మహిళా డ్రైవ ర్లు భాగస్వాములు అయ్యారని వెల్లడించా రు.
మరోవైపు ఆమెకు ఆర్టీసీ యాజమాన్యమే డ్రైవర్ కొలువు ఇచ్చి ఉంటే బాగుం డేదని, అలా చేస్తే ఆమెకు సముచిత గౌరవం ఇచ్చినట్లయ్యేదని ఆర్టీసీ యూనియన్స సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు సంస్థ ద్వారా ఉద్యోగం ఇ ప్పించి, అది ప్రభుత్వ ఘనత అని చెప్పుకోవడం సరికాదని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ అ భ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఆర్టీసీలో ఆమె కు నేరుగా కొలువు ఇచ్చేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటే, వాటిని సవరించి కొలువు ఇ స్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నది.
డ్రైవర్ సరితకు శుభాకాంక్షలు : సీఎం
ఆర్టీసీ (ప్రైవేటు అద్దె బస్సు) తొలి మహిళా డ్రైవర్గా విధుల్లో చేరిన వాంకుడో తు సరితకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘ఎక్స్’ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అవకాశమిస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరనడానికి సరితనే నిలువెత్తు సాక్ష్యమని కొనియాడారు. ఆర్టీసీలో మహిళా డ్రైవర్ నియామకం కీలకమైన ముందడుగు అని అభిప్రాయపడ్డారు.
మహిళలు సరితను ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.తమ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలకు సాధికారత కల్పించేందుకు కృషి చేస్తు న్నదన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ప్రణాళికలు రచిస్తు న్నదని స్పష్టం చేశారు.