16-06-2025 01:11:38 AM
- ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే సొంత నిర్ణయాలు.
- అనాజీపురం, అనంతారం సబ్ సెంటర్ లు నేలమట్టం
- కలప, ఐరన్ మాయం..!
- ప్రస్తుత భవనాలకు మీరే అద్దె చెల్లించాలని అదేశాలు
- ప్రశ్నించిన ఉద్యోగులకు తప్పని బెదిరింపులు
పెన్ పహాడ్, జూన్ 15 : ప్రభుత్వ పాలనలో ఉన్నత అధికారుల అనుమతులు లే కుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాలు నేలమట్టం చేయించడం.. అందులోని విలువైన కలప, ఐరన్ ఇతర వస్తువుల ను మాయం చేయడంతో పాటు కరోనా స మయంలో కోవాగ్జిన్, కోవిషీల్ వ్యాక్సిన్ లు పెద్ద ఎత్తున అమ్ముకొని సొమ్ము చేసుకోవ డం.. నిధుల దుర్వినియోగం వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పెన్ పహా డ్ మండల వైద్యాధికారి, హెచ్ఈఓలు. భవనాల కూల్చివేత, అక్రమ వసూళ్లకు సం బంధించి వీరిపైన ఆరోగ్య సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా వీరి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదంటూ మండల వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మండలంలోని అనాజీపురం, అనంతారంలో సబ్ సెంటర్లకు పక్కా భవనాలు ఉం డే. అయితే వీటిలో అనంతారం భవనం దాదాపు పూర్తిగా శిధిలావస్థకు చేరుకోగా.. అనాజీపురం భవనంకు కొంత నిధులు కెటాయించి మరమ్మత్తులు చేస్తే కొన్ని సంవత్స రాలు పాటు ఉపయోగంలో ఉండేది. కానీ దీనిని సైతం నేలమట్టం చేయడంలో ఆంత ర్యం అర్థం కావడం లేదని ఆ గ్రామస్తుల నుంచి ఇప్పటికి అభిప్రాయాలు వ్యక్తమవుతుండడం గమనించదగ్గ విషయం.
ఇష్టారాజ్యంగా కూల్చివేతలు..!
ఈ భవనాలు శిధిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ ఆద్వర్యంలో తీర్మాణాలు చేసి మండల వై ద్యశాఖకు అందజేశారు. అయి తే జిల్లా మినరల్ ఫండ్, ఎన్ఎచ్ఎం నిధులు కూడా మంజూరు కాగా ఎన్ఎచ్ఎం నిధుల కింద పనులు మొదలు పెట్టారు. అంతా భాగనే ఉంది. పాత భవనాలను కూ ల్చడానికి జిల్లా ఉన్నత అధికారుల అనుమతి లేకుండా స్థానిక వైద్యాధికారి డాక్టర్ స్రవంతి, హెచ్ఈఓ చంద్రశేఖర్రాజులు ఇష్టారాజ్యంగా భవనాన్ని కూల్చి వేయించి విలు వైన కలప, ఐరన్ ఇతరత్రా విలువైన వస్తువులు రాత్రికి రాత్రే తరలించి సొమ్ము చేసు కున్నట్లు ఆరోపనలు గ్రామస్థుల నుంచి వ స్తున్నాయి.
అనంతారం సబ్ సెంటర్ పనులు స్లాబ్ లెవల్ కు రాగా అనాజీపురం సబ్ సెంటర్ పనులు నేలమట్టంలోనే ముగ్గు కూడా పోయలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ నిధులు వెనుకకు మళ్ళిపోయిన ట్లు తెలిసింది. అనంతారం సబ్ సెంటర్ పనులు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిలిపి వేశాడు. ఈభవనాలు కూల్చి వేసినప్పుడు చంద్రశేఖర్ రాజు దగ్గర ఉండి పర్యవేక్షణ చేసినట్లు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ద్వారానే తెలుస్తుంది.
బజారున పడ్డ వైద్య సేవలు
సంవత్సరం పైబడి ఈ గ్రామాలలో ప్రజా వైద్యం బజారు పాలు అయింది. ప క్కా భవనం లేక అనాజీపురంలో అద్దె రూం లో (ఇరుకు గది) సేవలు, అనంతారం గ్రా మ పంచాయతీ భవనంలోని ఓ ఇరుకు గది కెటాయించడంలో వసతులు లేక బజారులోనే వైద్య సేవలందిస్తున్నారు. అనాజీపురంలో జాస్ నిధులు వచ్చినప్పటికి సుమారు 18 నెలల నుంచి అద్దెను ఎంఎల్ ఎచ్ పీ తానే స్వంతంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఉన్న నిధుల్లో అద్దె చెల్లింపులు చేస్తానంటే డాక్టర్, హెచ్ఈఓ ససేమరా అనడంతో సొంతంగా చెల్లిస్తున్నట్లు ఎంఎల్ ఎచ్ పీ లు బాహటంగానే చెబుతుండడం గమనించదగ్గ విషయం.
నిబంధనలకు పాతర..?:
మండల కేంద్రములో పీ హెచ్ సీ తో పాటు 10 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఇటీవల వీటికి ఓక్కో సబ్ సెంటర్కు జాస్, అంటైడ్ నిధులు రూ.80వేలు నిధులు మంజూరు అ య్యాయి. ఈ నిధులను ఆయా సబ్ సెంటర్ పరిధిలోనే ఖర్చు చేయాలి. అదీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మేరకే ఖర్చు చేయాలి తప్ప ఇక్కడ నిధులు వేరే చోట (విభిన్నంగా) అవసరాలకు ఖర్చు చేయద్దనే నిబంధనలు ఉన్నాయి. అయినా వీటికి పాత్ర వేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారనే అభియోగాలు ఉన్నాయి.
దొరికిన కాడికి గుంజుడే..!
మండల కేంద్రములోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో వినియోగిస్తున్న ఇంటర్నెట్ బిల్లు చెల్లింపుల కోసం 9సబ్ సెంటర్ల నుంచి రూ.5 వేలు చొప్పున రూ.45వేలు, అలాగే డీఎంహెచ్ కార్యాలయం, మైక్రోస్కోప్ రిపేరు పేరుతో రూ.570, పీహెచ్సీ స్టేషనరీ కోసం రూ.5000, పీహెచ్సీలో జాస్ మీటింగ్ ఖర్చుల నిమిత్తం మరో రూ.4వేలు మొత్తంగా రూ.1లక్ష 30వేల130, అంతేకాకుండా ఫర్నీచర్ కొనుగోలు పేరుతో ఒక్కో సెంటర్ నుంచి రూ.12వేల నుంచి రూ.19 వేలు (సుమారు 1లక్ష 80 వేలు) డ్రా చేసినట్టు.. సంబందిత ఏఎన్ఎంలే లబోదిబో మంటున్నారు.
ఈతంతంగం అంతా డాక్టర్ స్రవంతి సూచనల మేరకు హెచ్ఈఓ చంద్రశేఖర్రాజు ఆయా సబ్ సెంటర్ల ఎకౌంట్లకు సంబందించి ఖాళీ చెక్కులు తీసుకొని చంద్రశేఖర్రాజు తన స్వంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ పైసల పంచాయతీ ఆనోటా ఈనోటా రావడంతో అప్పటికప్పుడు మచ్చుకు కొంత ఫర్నీచర్ రాత్రికి రాత్రే పంపించినట్టు.. వీటికి కూడా తీర్మాణాలు కూడా లేవని ఏఎన్ఎంలే పెర్కోంటు న్నారు. వచ్చిన నిధులు నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఖర్చు చేయలేక పోయామని అధికారులే ఇలా చేస్తే ఏం చేయాలని ఏఎన్ఎంలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పీహెచ్సీ కి వస్తున్న నిధుల సంగతేంటని.. వీటి లెక్కలు కూడా అధికారులు లెక్కలు తేల్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.
యాప్ లోనూ డూప్ లే..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాస్ నిధులకు సంబందించి జాతీయ స్థాయిలో ఆరోగ్య మందిర్ యాప్ ఉంది. వచ్చిన నిధులకు.. సంబందించి ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు పొంద పర్చాలి. కాని ఆవివరాలన్నీ ఎంఎల్ ఎచ్ పీ లు గాని ఏఎన్ఎం లాగిన్ ద్వారానే అప్లోడ్ చేయాలి. కాని ఈఘనులైన డాక్టర్ స్రవంతి, చంద్రశేఖర్రాజు సంబందిత వారితోనే బెదిరించి లాగిన్ ఓపెన్ చేయించుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టినట్టుగా యాప్లో మాయలు చేస్తున్నట్లు ఆరోపనలు వినిపిస్తున్నాయి.
లెక్కలు పక్కాగా తేలుస్తాం
పీ హెచ్ సీ, సబ్ సెంటర్ లకు సంబంధిం చి అన్ని లెక్కలు పక్కగా తేలుస్తాం. భవనాలు కూల్చివేతకు సంబందించి జిల్లా ఉన్నతాధికారుల ఆర్డర్ కాపీ లేక పోతే చట్టపర చర్యలు తప్పవు. నిధులు మాయం చేస్తే తప్పక కక్కి స్తాం. విచారణ నిష్పక్షపాతంగా జరుగుతది. ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ సేవల ను ప్రజలకు అందజేయడమే మా అంతిమ లక్ష్యం.
కోటి రత్నం, డిప్యూటీ డిఎంహెచ్ఓ