16-06-2025 01:05:12 AM
ఖమ్మం, జూన్ 15 (విజయక్రాంతి): ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని, తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిం చి తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణం శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలే రు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలా నికి చెందిన ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ గురించి సోమవారం క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. నాయకుల మధ్య సఖ్యత ఉండాలని నాయకులు ఎవరైనా ప్రజాసమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువే ఉంది కాబట్టి గ్రామాల్లో లోటుపాట్లు ఉంటే వాటి ని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వాలన్నారు.
రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువున్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజల దరిచేర్చడం జరిగిందని, రాబోవు వారం రోజుల్లోనే అర్హులైన రైతులకు గుంట మొదలుకుని ఎన్ని ఎకరాలుంటే అ న్ని ఎకరాల వరకు రైతుభరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
సంక్షే మ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే అని, గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు..వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా చూసుకోవాలన్నారు.