26-06-2025 08:03:22 PM
మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి..
మేడ్చల్ అర్బన్: మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని మేడ్చల్ ఏసిపి శంకర్ రెడ్డి(ACP Shankar Reddy) అన్నారు. గురువారం మేడ్చల్ పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ మాదకద్రవ్యాలపై వ్యతిరేక ప్రచారాన్ని పట్టణంలోని కాలనీలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం జీవితాన్ని అందరంలోకి నెట్టడమే కాకుండా జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని తెలిపారు. “మాదకద్రవ్యాలకు నో చెబుతూ జీవితానికి ఎస్ చెప్పాలని” సందేశాన్నిచ్చారు. విద్యార్థి దశ నుంచే చిన్నారులు చెడు వ్యసనాలు, డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏసిపి శంకర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు మన్మధ్, సురేష్ పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు..