26-06-2025 08:07:08 PM
కంగ్టి: విద్యార్థులు, యువకులు మత్తు పదార్థానికి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండలని స్థానిక ఎస్ఐ దుర్గా రెడ్డి(SI Durga Reddy) అన్నారు. గురువారం ఆయన జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం కావదన్నారు. మత్తు పదార్తాల అలవాటు తన జీవితాన్ని కాకుండా తన కుటుంబాన్ని సైతం చిన్నాభిన్నం చేస్తుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి అలవాట్లు, మంచి మార్గం ఎంచుకుని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదిగేలా కష్టపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎశ్వంత్, ఉపాధ్యాయులు, అంబాజీ, సంతోషకుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.