31-05-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే30 విజయ క్రాంతి): బడి ఈడు పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో బడిబాట కార్యక్రమంలో భాగం గా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 6 నుండి 19 వరకు జరగనున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవం తం చేయాలని సూచించారు.
ఉపాధ్యాయు లు అందరూ పాల్గొని హ్యాబిటేషన్ వారీగా తమ విధులను నిర్వహించాలన్నారు. బడి బయట పిల్లలను గుర్తించి సమీపంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు.
పాఠశాలల్లో చిన్న చిన్న మరమ్మత్తులు,పరిసరాల పరిశుభ్రత తదితర పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎం ఓ ఉద్ధవ్, ఏటీడీఓలు చిరంజీవి, కమ్మర్ హుస్సే న్, శ్రీనివాస్, జిసిడివో శకుంతల, గిరిజన క్రీడ అధికారి మీనారెడ్డి, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.