31-05-2025 12:00:00 AM
- వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూళ్లలో వేగం పెంచాలి
- పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషన్లకు మార్గదర్శకాలు
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ల తో శుక్రవారం సమావేశమైన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (రెవెన్యూ), గ్రేటర్ పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూళ్లలో మెరుగుదల, జీఐఎస్ సర్వేకి సంబంధించి పలు కీలక సూచనలు చేశారు.
ఈ మేరకు అదనపు కమిషనర్ (రెవెన్యూ) కార్యాలయం నుం చి పత్రికా ప్రకటనను వెలువరించింది. ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి జూన్ 30తో అర్ధ వార్షికం పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఆలోగా చెల్లింపులు చేసేవారికి ఎలాంటి పెనాల్టీ విధిం చబోమని, ఈ విషయాన్ని బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో వినియోగదారులకు అవగాహన కల్పించి, పన్నులు చెల్లించేలా కృషి చేయాలన్నారు.
వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వసూళ్లలో వేగం పెంచాలని డిప్యూటీ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్లకు సంబంధించి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని బిల్ కలెక్టర్లను సైతం ఆదేశించారు. జీఐఎస్ సర్వే ద్వారా గుర్తించిన ఆస్తులకు సంబంధించి జీహెచ్ఎంసీ చట్టం అనుసరించి ఆస్తుల అంచనా/సవరణను చేపట్టాలని డిప్యూటీ కమిషనర్లకు సూచనలు అందాయి.