19-01-2026 08:41:04 PM
కొల్చారం,(విజయక్రాంతి): బిల్లులు చెల్లించలేదని నిరసిస్తూ కొల్చారం మండలం చిన్నఘనపూర్ హైస్కూల్ డైనింగ్ హాల్కు గుత్తేదారు మంగలి శంకర్ తాళం వేశారు. 'మన ఊరు - మన బడి' కింద రూ. 10 లక్షల సొంత డబ్బుతో హాల్ నిర్మించి మూడేళ్లయినా ప్రభుత్వం నుంచి నయా పైసా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాళం వేయడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి తన బకాయిలు చెల్లించాలని కోరారు.