బడి అంటే చిన్నారులకు పండుగలా ఉండాలి
జయశంకర్ బడిబాట పిల్లలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన పెద్దలు
గోపాలపేట జూన్ 13: బడి అంటే చిన్నారులకు పండుగల అనిపించి పరిగెత్తుకొని వచ్చేలా చూడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అన్నారు. గోపాలపేట మండలం బుద్ధారం యుపిఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు బడి పున ప్రారంభోత్సవాన్ని పండుగలా జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకుప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రెండు జతల దుస్తులు మంచి పౌష్టికరమైన ఆహారం ఆంగ్ల మాధ్యమంలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన కల్పిస్తుందని చెప్పారు.
అంతకుముందు చిన్నారులచే సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేసి నూతనంగా చేరిన విద్యార్థులకు ఆ గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారుల చేత అక్షరాలను దిద్దించి సామూహిక అక్షరాభ్యాసం చేయించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జయశ్రీ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం భాస్కర్ మాజీ సర్పంచ్ అచ్యుత రామారావు వెంకటయ్య బిళ్ళ కంటి రాజు మాజీ ఎంపిటిసి అరు శ్రీదేవి విష్ణు మాజీ వార్డు సభ్యులు శ్రావణ్ కుమార్ చంద్రయ్య పంచాయతీ కార్యదర్శి కాశన్న నరేందర్ కారోబార్ జగపతిరావు పాఠశాల ఉపాధ్యాయుల సిబ్బంది పారిజాత సునీత యాదమ్మ అనిత నాగలక్ష్మి కృష్ణ అంగన్వాడి టీచర్ భాగ్యలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






