14-06-2025 12:00:00 AM
చివ్వెంల, జూన్ 13: రైతు భరోసా పథకం వానాకాలం 2025 కు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి డి.వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఏవో కార్యాలయంలో రైతు భరోసా కు నూతన దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకం జూన్ 5, 2025 లోపు వచ్చిన రైతులు నూతనంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
రైతు భరోసా అప్లికేషన్ ఫారం ,పట్టా దారు పాసు పుస్తకం జిరాక్స్,ఆదార్ కార్డ్ జిరాక్స్ ,బ్యాంకు అకౌంట్ పుస్తకం జిరాక్స్ లను తమ ఏ ఈ ఓ లకు రైతులు ఈనెల 20 లోపు అందించాలన్నారు. గతంలో రైతు భరోసా స్వీకరించిన వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు కే.వెంకట్ రెడ్డి, బి.శైలజ, డి.మానస,టి.ప్రియాంక మరియు రైతులు ధరావత్ సురేష్,శంకర్, ఫుల్ సింగ్, మట్టపల్లి సందీప్ తదితరులు పాల్గొన్నారు.