16-06-2025 02:18:23 AM
హెచ్సీయూ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు
శేరిలింగంపల్లి, జూన్ 15: చదువు ఒక్కటే భవిష్యత్తును మారుస్తుందని హెచ్సీయూ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. మియాపూర్ మాతృశ్రీ నగర్ లో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ అధ్వర్యంలో ‘బడిబాట‘ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్సీయూ తెలుగు ప్రొఫె సర్ దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ వాలంటీర్లు, జేఎన్టీయూ, ఐటీ విద్యార్థులు, డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ టీచర్లు నగరంలోని పలు కాలనీలలో పర్యటించి విద్యవల్ల కలిగే లాభాలు వారికి వివరించి పిల్లలను బడికి పంపాలని విజ్ఞప్తి చేశారు. మంచి సమాజ నిర్మాణం కావాలనే ఆశయంతో వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ వ్యవస్థాపకురాలు చావా అరుణ, ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు, జేఎన్టీయూ విద్యార్థులు, డాక్టర్లు, వలం టీర్లు తదితరులు పాల్గొన్నారు.