16-06-2025 02:19:41 AM
పాల్గొన్న నాగోల్ కార్పొరేటర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 15(విజయక్రాంతి): నాగోల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరలోని నూతన ఈవీ ఎలక్ట్రికల్ స్కూటీ వాహనాల షోరూంను ఆదివారం నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నిర్వాహ కులు అనంతుల రాజారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అరుణ సురేందర్ యాదవ్ మాట్లాడుతూ.. రాను న్న రోజుల్లో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రికల్ స్కూటీలు ఎంతగానో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. కార్యక్ర మంలో కార్పొరేటర్తో పాటు బీజేపీ నాయకులు మైనం రాజేశ్వర్, పాల్వాయి సంజీవరెడ్డి, దేవుడి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.