11-06-2025 05:48:24 PM
తాడ్వాయి (విజయక్రాంతి): అన్ని పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాడ్వాయి ఎంఈఓ రామస్వామి(MEO Ramaswamy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం ఒక్కరోజు పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలన్నారు. తరగతి గదులలో, పాఠశాల ఆవరణలో ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు. పాఠశాల ఆవరణలో ఎక్కడైనా నీళ్లు ఆగే ప్రదేశం ఉన్నట్లయితే వెంటనే ఆగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పి ప్రశాంత్, ఎర్ర పహాడ్ ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.