11-06-2025 05:51:33 PM
ట్రాఫిక్ సి.ఐ. మహాలక్ష్మయ్య..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): వైఫల్యాలను అధిగమించడానికి కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారానే విజయాలను సాధిస్తారని నల్లగొండ ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య(Nalgonda Traffic CI Mahalakshmaiah) చెప్పారు. బుదవారం ఎంవియన్ విజ్ఞాన కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సర్టిఫికేట్స్ పంపిణి చేశారు. పై చదువులకు వెళ్లాలంటే ఒకటో తరగతి ఎంత ముఖ్యమో కంప్యూటర్ విద్యను అభ్యసించాలంటే పిజిడిసిఏ అంతే ముఖ్యమని అన్నారు. విద్యార్ధులు చదువుకొవడానికి ప్రస్తుతం నల్లగొండలో ఎంవియన్ విజ్ఞాన కేంద్రం ఇంత పెద్ద అవకాశం కల్పిచడాన్ని అభినందించారు. కంప్యూటర్తో పాటు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు.
అలాగే మన విద్యార్ధులు విదేశి విధ్యార్దుల కంటే గ్రామర్లో, అక్షరదోషాలు రాకుండా ఉండటంలో ముందుటున్నారని అన్నారు. పోటి పరిక్షలకు ప్రిపేరు అయ్యే విధ్యార్ధులకు అంగ్ల బాషలో కమ్యూనికేషన్ స్కీల్స్ ముఖ్యమని చెప్పారు. గొప్ప, పెద్ద వారు కూడా క్రింది నుండి వచ్చిన వారేనని పేర్కోన్నారు. ఇక్కడికి వచ్చే విధ్యార్ధులు కూడా ఆస్థాయికి ఎదగాలని చేరుకోవాలని అన్నారు. మనం నిర్దేశించుకున్న లక్ష్యం, పని, కర్తవ్యంపై అంకితభావంతో పని చేస్తే అ లక్ష్యానికి చేరుకుంటామని అన్నారు.ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య మాట్లాడుతూ... ఇప్పటి వరకు కంప్యూటర్ శిక్షణా మా దగ్గర 22వేల మంది విద్యార్ధులకు పైగా శిక్షణా పోందారని గుర్తు చేశారు.
ఇప్పటికే విద్యా, వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ సంస్థ కృషిచేస్తుందని చెప్పారు.2011లో సంస్థను ప్రారంభించిన నాటినుండి అనేక దాతల సహకారంతో ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కోచింగ్లు, గ్రంథాలయం నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్, కరాటే శిక్షణాకేంద్రం, షుగర్, బిపి, మూర్ఛ, పక్షవాతం ఉన్నవారికి ప్రతినెలా మూడవ ఆదివారం పరీక్షించి కేవలం రూ.100లకే నెలకు సరిపడు మందులు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఎంవియన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి పి నర్సిరెడ్డి, గ్రంధాలయ ఇంచార్జీ పి. యాదగిరి, ప్యాకల్టీ పి. శంకర్ తదితరులు పాల్గొన్నారు