06-06-2025 12:51:02 AM
జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 5 (విజయక్రాంతి); కొత్తగూ డెం కార్పొరేషన్ లో డివిజన్ ల విభజన ఆశాస్త్రీయం గా ఉందని జై భీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ విమర్శించారు.
గురువారం పార్టీ కా ర్యాలయంలో జరిగిన అసెంబ్లీ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సుమారు 1,34,019 మంది జనాభా కలిగిన కార్పొరేషన్ లో 60 డివిజన్ లు చేయాలనే ప్రభుత్వ జీ.ఓ ప్రకారం ప్రతీ డివిజన్ కు 2200 ఓ ట్లు, 2400 ఓట్ల వరకు ఒక డివిజన్ చేయాలి, కానీ అలా కా కుండా 2000 మంది ఓట్ల లోపు కూడా డివిజన్ లను చేయ డం జరిగిందన్నారు.
కొంతమంది నాయకులు వారికి అనుకూలంగా కొన్ని డివిజన్ లను, ప్రతిపక్ష నాయకులు బలంగా ఉన్న డివిజన్ లలో వేరు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎదురు, ఎదురుగా ఇండ్లు ఉన్నవారిని రెండు డివిజన్ లు చేశారని, గతంలో ఉన్న కొన్ని జనరల్ వార్డులను రిజర్వేషన్లుగా మార్చాలనే దురుద్దేశంతో ఒకే సిరీస్ ఇంటి నెంబర్లు ఉన్న డివిజన్ లను రెండు డివిజన్ లుగా చేసి రిజర్వేషన్లు మార్చేలా కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. సుజాతనగర్ లోని 42వ డివిజన్ లో నర్సింహ సాగర్,వేపలగడ్డ,మంగపేట,లక్ష్మీదేవిపల్లి గ్రామాలు భౌగోళికంగా వేరు,వేరు ప్రాంతాలను కలిపి డివిజన్ చేశారని ఇది సరైన విధానం కాదన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ వీరు నాయక్,అసెంబ్లీ అ ధ్యక్షుడు సాయి,నున్న శివ చౌదరి,పూణెం మురళి తదితరులు పాల్గొన్నారు.