06-06-2025 12:50:07 AM
ప్రథమ, తృతీయ బహుమతులు అందుకున్న జాగృతి ఎన్జీవో సంస్థ ప్రదర్శించిన నాటకాలు
ఎల్బీనగర్, జూన్ 5 : తెలంగాణా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ పోటీల్లో జాగృతి అభ్యుదయ సంఘం రాష్ట్రస్థాయి ప్రధమ, తృతీయ బహుమ తులను రాష్ట్ర పర్యావరణ అటవీశాఖ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అందజేశారు.
జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల కాలుష్యం - నియంత్రణ ఆవశ్యకతపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల నాటికల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాటికల విభాగంలో వనస్ధలిపురం జాగృతి అభ్యుదయ సంఘం గ్రీన్ సోల్జర్స్ ప్రదర్శించిన ‘గంగా‘ నాటికకు ప్రథమ, తృతీయ బహుమతులు గెలుచుకుంది.
కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం సనత్ నగర్ లో గురువారం బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి ఛైర్మన్ భావన శ్రీనివాస్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై తమ మీద మరింత బాధ్యతలు పెరిగాయన్నా రు.
కార్యక్రమంలోమంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదిమ్, టీజీపీసీబీ సభ్య కార్యదర్శి రవి కుమార్, సోషల్ సైంటిస్ట్ ప్రసన్నకుమార్, సీడబ్ల్యూసీ మాజీ చైర్ పర్సన్ శ్యామల దేవి, దారుణ్య, బాలజ్యోతి, బహుమతులు అందుకున్న నటీనటులు జీవన, అనూష, మణికంఠ, చంద్రశేఖర్,సిద్దిక్ష అక్షిత, మహాలక్ష్మి, నిహారిక, శ్రద్ధ, సాయి అక్షయ్ తదితరులుపాల్గొన్నారు