22 April, 2026 | 6:06 AM

పీజీ ఈసెట్‌కు సీట్లు కేటాయింపు

04-09-2025 12:50 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఎంఈ/ఎంటెక్/ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవే శాల కోసం నిర్వహించే పీజీఈసెట్ తొలివిడత సీట్లను అధికారులు బుధవారం కేటాయించారు. కన్వీనర్ కోటా సీట్లు 5,529 ఉండగా, వాటిలో విద్యార్థులకు 4,320 సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు గురువారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని సూచించారు.