31 August, 2026 | 10:14 PM

Breaking News

కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •   కాంగ్రెస్‌ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.!   •   24 గంటల విద్యుత్‌ కోసం రైతుల ధర్నా   •  

డీఎస్సీ నోటిఫికేషన్ వేయండి

04-09-2025 01:00 AM
  1. సీఎం రేవంత్‌రెడ్డికి నిరుద్యోగ అభ్యర్థుల వినతి
  2. ముఖ్యమంత్రికి లేఖలు రాసిన అభ్యర్థులు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే జారీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రకటించిన ఆరు వేల పోస్టులు, మోడల్, గురుకుల, టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు, ఉద్యోగ విరమణ ద్వారా ఏర్పడిన టీచర్ ఖాళీలు భర్తీ చేసేందుకు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు పోస్ట్ కార్డు ఉత్తరాలను బుధవారం రాశారు. 

గత డీ.ఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, ఈనేపథ్యంలో ఉపాద్యాయ పోస్టులు భర్తీ చేసేందకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వందలాది మంది అభ్యర్థులు లేఖలు రాశారు.   కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు హరీష్, వీరబాబు, సునీల్ , భాషా, రఘు, కిరణ్మయి,రచన, కవిత, మేఘన, రజిత, శ్రీలత, వాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.