calender_icon.png 5 June, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విత్తన ప్యాకెట్లు అందజేత

03-06-2025 11:10:26 PM

హాజీపూర్ (విజయక్రాంతి): నాణ్యమైన విత్తనము-రైతు నేస్తము కార్యక్రమంలో భాగంగా రైతులకు మంగళవారం నాణ్యమైన విత్తనాలను అందజేశారు. ప్రభుత్వము పంపిణీ చేసిన వరి (కెఎన్ఎమ్ 7715 పది కేజీల) బ్యాగ్, పెసర (ఎం జి జి 347 మూడు కిలోల) బ్యాగ్ లను ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు (జనరల్, ఎస్సీ, ఎస్టీ) అభ్యుదయ రైతులకి రెండు చొప్పున 50 రూపాయల నామినల్ ఛార్జీలు తీసుకొని పంపిణీ చేశారు.

అనంతరం ఈ రైతులకి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో విత్తనోత్పత్తి చేసి వచ్చిన విత్తనాలను అదే గ్రామంలోనీ రైతులకి విత్తనముగా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ ముని, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ఏడిఏ అనిత, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ సాయినాథ్, రైతు ఉత్పత్తి దారుల సంఘం ప్రతినిదులు, చైర్మన్ పుస్కురి శ్రీనివాస రావు, చైర్మన్ బొడ్డు శంకర్, సొసైటీ డైరెక్టర్ ధర్మరాజు, వ్యవసాయ అధికారి క్రిష్ణ, ఏఈఓ లు కొమురయ్య, మౌనిక, ప్రసన్న, మండల రైతులు తదితరులు పాల్గొన్నారు.