సపాయితో కలిసి మురికి కాలువను పూడిక తీసిన సీతంపేట సర్పంచ్ భర్త
16-12-2025 08:30 PM
ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని సీతంపేట గ్రామంలో మంగళవారం నూతనంగా గెలిచిన గ్రామ సర్పంచ్ ఇండ్ల కృష్ణవేణి భర్త సదయ్య సపాయితో కలిసి గ్రామంలోని మురికి కాలువను పూడిక తీశాడు. గ్రామంలో గత కొంతకాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగడంతో గ్రామంలోని మురికి కాలువలు నిండి దుర్వాసన వస్తుందని గ్రామస్తులు సర్పంచ్ కి తెలుపడంతో సర్పంచ్ ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన సపాయి నరేష్ ఒక్కడే మురికి కాలువలు శుభ్రం చేస్తున్నాడు. ఒక్కడు పడుతున్న ఇబ్బందిని గమనించిన సర్పంచ్ భర్త సదయ్య సపాయితో కలిసి మురికి కాలువలో పూడికను తీశాడు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ భర్త సదయ్యను అభినందిస్తున్నారు.






