రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
కేసముద్రం, జూలై 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ సుజాత, పీఈటీ విజయ నిర్మల తెలిపారు.
44 కేజీల విభాగంలో బి.మేఘన గోల్ మెడల్, 48 కేజీల విభాగంలో ఏ. దివ్య, బీ.స్వాతి, బీ. అంజలి, 53 కేజీల విభాగంలో టీ.తరుణ్య, డీ. శృతి కీర్తన, 58 కేజీల విభాగంలో టీ. ఇంద్రజ, 69 కేజీల విభాగంలో జీ. నందిని, 77 కేజీల విభాగంలో వీ.నందిని అత్యంత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి యూత్, జూనియర్, సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 9 మంది విద్యార్థులు పాల్గొంటారని వారు తెలిపారు.






