విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
11-03-2026 05:51 PM
గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ మండలం బంగ్లావెంకటపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. డీఈవోగా భరత్, ఎంఈఓ గా రుత్విక్ గౌడ్ ప్రధానోపాధ్యాయులుగా హర్షిత్ వ్యవహరించారు.
ఉపాధ్యాయులుగా అక్షర, అఖిల, అవని, సహస్ర, మేఘన, మనోహర్, అరవింద్, సాత్విక్ తదితరులు విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమం అనంతరం పిల్లలకు ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కొంటెమైన నాగలక్ష్మి నర్సింలు, ఉపాధ్యాయులు విజయ మాధవి,సునీల్,మహేందర్ రెడ్డి, రజిత, శ్యామల, నాగరాజు, గీతాంజలి, నవనీత, రాజశ్రీ, నాజీయా తదితరులు పాల్గొన్నారు.




