17 June, 2026 | 8:25 PM

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేత

17-06-2026 07:18 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ రాజీవ్ నగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు నిర్మల్ జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం పాఠ్యపుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు ప్రోత్సహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పౌష్టికాహారం, ఆటలు, పాటలు, వంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గేయలత ,రాజమణి, అంగన్వాడి ఉపాధ్యాయురాలు విజయ, లక్ష్మి, తదితరులు ఉన్నారు.