31-05-2025 08:01:01 PM
ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రగాఢ సంతాపం..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జంజీరాల రాజం అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) దివంగత రాజం ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రాజం పార్థివదేహానికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే వెంట బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, మల్లారం చినరాజం, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాథరి స్వామి, మునిమంద రమేష్, ముచ్చర్ల మల్లయ్య, దేవ రమేష్ ఉన్నారు.