calender_icon.png 2 June, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ కాంగ్రెస్ నేత రాజం మృతి..

31-05-2025 08:01:01 PM

ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రగాఢ సంతాపం..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జంజీరాల రాజం అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) దివంగత రాజం ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా రాజం పార్థివదేహానికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్యే వెంట బెల్లంపల్లి కాంగ్రెస్ నాయకులు చిలుముల శంకర్, మల్లారం చినరాజం, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాథరి స్వామి, మునిమంద రమేష్, ముచ్చర్ల మల్లయ్య, దేవ రమేష్ ఉన్నారు.