31-05-2025 08:02:54 PM
కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మర్కంటి ఏగొండ..
గజ్వేల్: ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మర్కంటి ఏగొండ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 14 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలు పెంచినందుకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గడ్చల్ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ కిసాన్ మోర్చ కార్యదర్శి మర్కంటి ఏగొండ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే రైతు సంక్షేమానికి గొప్ప నిర్ణయాలు తీసుకోవడంతోపాటు అమలు చేయడం జరిగిందన్నారు. మరోసారి పంటలకు మద్దతు ధర పెంచి రైతులకు అండగా ఉన్నామని ప్రధాని భరోసా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ, పట్టణ, మండల బిజెపి నాయకులు రైతులు పాల్గొన్నారు.