31-05-2025 07:58:37 PM
మేడ్చల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై హింద్ యాత్రలో భారత సైనికుల శౌర్యాన్ని శంకించడం సరికాదని బిజెపి నాయకులు బొజ్జ వంశీధర్ రెడ్డి, జకాట ప్రేమ దాస్, శ్రీపాల్ రెడ్డి అన్నారు. మేడ్చల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్(Operation Sindoor), విజయవంతమైందని, దీనిని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక ఇష్టానుసారంగా సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతున్నారన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే యుద్ధం ఆపారనడం అర్థరహితమన్నారు. యుద్ధంలో భారత సైనికులు మరణించారని, యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చి వేసిందని మాట్లాడడం అవివేకం అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు.