28 June, 2026 | 3:06 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

విడిపోయి.. కలిసుందాం!

12-09-2024 12:00 AM

ఏ కుటుంబంలో అయిన భార్యాభర్త గొడవలు సహజం. గొడవలు లేని కుటుంబం అందం ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చిన్న విషయాలకు భావోద్వేగానికి గురై.. విడాకుల వరకు వెళ్తున్నారు. అలాకాకుండా బంధం దృఢంగా.. మరింత ఆనందంగా ఉండాలంటే విడాకుల్లో కొత్త ట్రెండ్ వచ్చేసింది. అదే విడిపోయి కలిసుండే ‘ట్రయల్ సపరేషన్’ పద్ధతి. దీని కారణంగా భాగస్వాముల్లో మనసు మారితే ఆ బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పరస్పరం విడిపోయి ఇద్దరూ ఒంటరిగా ఉండటం కారణంగా భార్య గురించిన ఆలోచనలతో భర్త, భర్త గురించిన ఆలోచనలతో భార్య మనసు నిండిపోతుంది.

ఈ సందర్భంగా అసలు తాము ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అంత తీవ్రమైన సమస్యలున్నాయా? పరిష్కరించుకోలేనివా? అనే ఆలోచనలు వస్తాయని, దీంతో రియలైజ్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒకరిపట్ల ఒకరికి కోపం తగ్గడం సానుకూల భావన ఏర్పడం వంటి కారణాలతో తిరిగి కలిసిపోవాలనే ఆలోచన వస్తుంది. ఫలితంగా విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకుందామనుకునే చాన్స్ ఉంటుంది. పైగా దూరం పెరగడం వల్ల వచ్చిన మార్పు తర్వాత కలిసిపోయిన భాగస్వాముల బంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.