ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు
వాషింగ్టన్: ఇరాన్ లోని కీలక స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు నిర్వహించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఆదేశాల మేరకు ఇరాన్లోని 10 లక్ష్యాలపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్(US Central Command) ప్రకటించింది. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించి వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేపట్టింది.
ఇరాన్ దాడులకు ప్రతీకార చర్యలకు దిగిన అమెరికా, హర్మూజ్ జలసంధిలో 'కికు' చమురు ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్ నిఘా, వాయు, రక్షణ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ భూభాగంపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా కువైట్ మరియు బహ్రెయిన్లపై దాడులు నిర్వహించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదివారం ప్రకటించాయి. అలాగే, ఇకపై ఎటువంటి దురాక్రమణ చర్యకైనా తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించాయి.






