22 April, 2026 | 1:34 AM

చలివేంద్రం ఏర్పాటు

22-04-2026 12:00 AM

కొండపాక, ఏప్రిల్ 21: వెలికట్ట చౌరస్తాలో సర్పంచ్ బూర్గుల మానస సురేందర్ రావు మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బూర్గుల మానస సురేందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గంతో కలిసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రతినిత్యం వేలాదిమంది ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసరి లింగారావు, ఉప సర్పంచ్ అమ్ముల పరుశరాములు, వార్డు మెంబర్స్ ముత్యంరావు, భాస్కర్, నాయకులు మంచాల కనక రాములు, కొమురవెల్లి రాజు, బూర్గుల నరేందర్ రావు, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.