22 May, 2026 | 7:06 AM

మరోసారి కాల్పులు..

04-02-2025 01:27 AM
  • చత్తీస్‌గఢ్‌లో ఘటన
  • మావోలకు మరో దెబ్బ

రాయ్‌పూర్, ఫిబ్రవరి 3: చత్తీస్‌గఢ్‌లోని కాంకర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోం ది. చనిపోయిన మావోయిస్టును జతిన్ మాండవిగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. జతిన్ తలమీద రూ. 8 లక్షల రివార్డు ఉండడం గమనార్హం. అంతే కాకుండా పలువురు మావోయిస్టులు కూడా లొంగి పోయినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసు కున్నట్లు ఎస్పీ తెలిపారు.