calender_icon.png 25 November, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రమయతే జయతే జిల్లా సమిష్టి కృషి ఫలితం జాతీయ అవార్డు

25-11-2025 12:00:00 AM

 కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 24, (విజయక్రాంతి):జిల్లా నీటి సంరక్షణలో సాధిం చిన విశిష్ట విజయాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘జల్ సంచయ్‌జన్ భాగీదారీ’ జాతీయస్థాయిలో మూడో జోన్కు చెందిన కేటగిరీ3లో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించడం మరియు విశిష్ట ఫలితానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన సందర్బంగా జిల్లా గ్రామీ ణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలె క్టర్ జితేష్ వి. పాటిల్ , అదనపు కలెక్టర్ వే ణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సెం ట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్ మెంబర్ పృధ్విరాజ్ కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమా న్ని ప్రారంభించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన ప్రతి కార్యక్రమం అధికారుల నిబద్ధత, గ్రామస్థాయి వర్గాల ప్రాముఖ్యతతో విజయవంతమైందని పేర్కొన్నారు. శ్రమయతే జ యతే అనే నానుడికి నిజమైన ప్రతీరూపం గా భద్రాద్రి కొత్తగూడెం నిలిచిందని, జిల్లా సాధించిన చిత్రాలు,గణాంకాలు జాతీయ స్థాయి వేదికపై చూసినప్పుడు గర్వ భావన కలుగుతోందని అన్నారు.మొదట తక్కువ ఖ ర్చుతో ఇంకుడు గుంతలు ఎలా త్రవ్వాలన్న దానిపై పరిశీలన జరిపి ఎంపీడీవోలు ప్రతిపాదించిన మోడల్ను అమలులోకి తీసుకు వచ్చామని, తరువాత ఉపాధి హామీ కూలీ లు, పంచాయతీ వర్కర్ల తో ప్రత్యక్షంగా పా ల్గొనడంతో త్రవ్వకాలలో ఎదురయ్యే సమస్యలను గుర్తించగలిగామని తెలిపారు.

పనికి కావాల్సిన చిన్న పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడంతో పలుగు పారా పరి కరాలను జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసి కూలీలకు సహాయంగా నిలిచామన్నారు. పంచా యతీ వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లతో ప్రారంభమైన ఒక ఉద్యమం లా అన్ని శాఖల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా విస్తరించి, జాతీయస్థాయిలో జిల్లాకు ఈ ప్ర తిష్ఠాత్మక అవార్డు అందించిందని చెప్పా రు. అవార్డు సాధించడం ముఖ్య లక్ష్యం కా దని, భూగర్భ జలాల పరిరక్షణ, వ్యవసాయానికి నీటి అందుబాటును పెంచడం, వర్షపు నీరు భూమిలో చేరేలా చేయడం అసలు ఉద్దేశమ ని కలెక్టర్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల బహుమతిని కూ లీలకు త్రవ్వకాల భారాన్ని తగ్గించే యంత్ర పరికరాల కొనుగోళ్లకు వినియోగించాలన్న సూచన చేశారు. అలాగే జి ల్లాలో ఇప్పటికే తవ్విన ఇంకుడు గుంతలను శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభించాలని, బయోచార్, ఫా మ్ పౌండ్ల నిర్మాణం ద్వారా నేల సారాన్ని కాపాడి భూభాగ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లావ్యాప్తంగా సూ చనలు జారీ చేశారని తెలిపారు. కార్యక్రమం చివరగా జిల్లా కు జాతీయస్థా యి గుర్తింపు తీసుకువచ్చిన జిల్లా అధికారులకు,ఎంపీడీవోలు, పంచాయతీ సిబ్బంది, వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, వైద్యశాఖ, ఇరిగేషన్,సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గారు సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. నీటి సంరక్షణ ఉద్యమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఈ ఉత్సాహం, ఈ కృషి అదే విధంగా కొనసాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.