7 April, 2026 | 1:37 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

ఐటమ్ సాంగ్‌తో శ్రష్టి ఎంట్రీ

17-02-2026 12:00 AM

ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఓ ఐటెం సాంగ్‌తో వెండితెర ప్రేక్షకులను పలకరించనున్నారు. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో శ్రష్టి వర్మ అలరించనున్నారు.

ఈ పాటను మేకర్స్ ఈ వారంలోనే విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞానప్రభ మాట్లాడుతూ.. “ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ప్రముఖ డ్యాన్సర్ శ్రష్టి వర్మ ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.. ఓ ఐటెం సాంగ్‌తో ఆమె సిల్వర్ స్క్రీన్‌కు ఎంట్రీ ఇస్తున్నారు” అని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి డీవోపీ: వెంకట హనుమ; ఎడిటింగ్: సాయిబాబు తలారి; ఆర్ట్: భార్గవాచారి నౌండ్ల.