13-06-2025 01:10:49 AM
బాధితులు భూపాల్ రెడ్డి, రామేశ్వరి ఆవేదన
నల్లగొండ టౌన్, జూన్ 12: నా సొంత భూమిలోనికి అక్రమంగా చొరబడి హద్దురాళ్ళను తొలగించిన వ్యక్తులపై చట్టరీత్యా చర్య తీసుకోగలరని పర్వతగిరి గ్రామానికి చెందిన బాధితులు గార్లపాటి భూపాల్ రెడ్డి, గార్లపాటి రామేశ్వరి పేర్కొన్నారు. గు రువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కనగల్ మండలం జి చెన్నారం గ్రామంలో గతంలో గతంలో కుకూట్ల శేఖర్ వద్ద సర్వే నెం. 70,71 లలో ఎ. 3-00 భూమిని కొ నుగోలు చేశాం.
ఆభూమి ధరణిలో నమోదు అయ్యి 2021 పాస్ బుక్ వచ్చింది. ఆ భూమిని మండల సర్వేయర్, జిల్లా సర్వేయర్ సర్వే చేసి హద్దులు కూడా చూపించారు. ఆ రిపోర్టు ప్రకారం మేము భూమికి పోలీసు వారి సమక్షంలో హద్దు రాళ్ళు పాతుకొని కంచె ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవల మా పక్క భూమి యజమాని కంచర్లకుంట్ల వెంకట్ రామ్ రెడ్డి అనుచరులు హద్దురాలను కంచెను తొలగించారు.
ఈ విషయంపై కనగల్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేస్తే ఎస్ ఐ వి ష్ణు మమ్ముల్ని బెదిరిస్తున్నాడు. నేను పోలీస్ స్టేషన్లో పని చేసినంతవరకు మీరు ఆ భూమి మీదికి పోవద్దు ఒకవేళ పోతే ఆడ మనిషి అని చూడకుండా లోపల వేస్తా అని బెదిరిస్తున్నాడు.
మీకు న్యాయం కావాలంటే 10 లక్షలు ఇస్తే భూ సమస్య పరిష్కారం చేస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు తెలిపారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.