11 March, 2026 | 2:33 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

పాత జ్ఞాపకాలతో సింగరేణి సీఎండీ

09-03-2026 12:00 AM

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 8, (విజయక్రాంతి): ఇటీవలే సింగరేణి సంస్థ చైర్మన్ మరియు యండి గా నియమితులైన డా. బుద్ధ ప్రకాష్ జ్యోతి కొత్తగూడెం ఏరియా పర్యటన సందర్భంగా, 2007లో తాను ఐటిడిఏ భద్రాచలం ప్రాజెక్టు అధికా రిగా పనిచేసిన కాలంలో గిరిజన విద్యా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేసిన డా. ప్రభుదయాల్ గృహాన్ని ఆయన  సందర్శించారు. ఆయన బాగోగులు తెలుసుకున్న అనంతరం ఇటీవలే ఆయన కుమారుని వివాహం జరిగినందున నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేసిన కాలంలోనే గిరిజన విద్యా కళాశాల గణనీయమైనా ప్రగతి సాధిం చింది. జాతీయ ఉపాధ్యాయ మండలి న్యూఢిల్లీ ప్రత్యేక గుర్తింపు, బిఇడి 200 సీట్లు, నూతన 3 బ్లాక్ భవనాల మంజూరు, కంప్యూటర్ లాబ్, గ్రంథాలయ ఏర్పాటు, ఇగ్నో స్టడీ సెంటర్ ఏర్పాటు వంటివి ఆయన హయంలోనే జరిగాయి. వాటిన న్నింటినీ గుర్తు చేశారు. కళాశాల అభివృద్ధి పట్ల నాడు దయాల్ చూపిన ప్రత్యేక శ్రద్ధను ఆయన ఙప్తికి తెస్తూ నేడు దయాల్ ను అభినందించారు.  సింగరేణి సంస్థ సిఎండి అయినందున దయాల్ కుటుంబ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు.