calender_icon.png 30 July, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవలన్నింటికీ సింగిల్‌విండో

15-05-2025 12:00:00 AM

  1. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సులభతరంగా అనుమతులు
  2. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగొద్దు
  3. పౌరసేవలు మెరుగ్గా అందేందుకు సమన్వయంతో పనిచేయాలి
  4. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధి అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వివిధ రకా ల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని, సేవలన్నింటికీ సింగిల్‌విండో విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి అధ్యయనంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పౌరసేవలు, అనుమతులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగురోడ్డు పరిధిలోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తులు చేసుకొని ఆయా కార్యాల యాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు.

ఏదైనా నిర్మాణం లేదా గృహాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన సేవలకు ఒకే ప్లాట్‌ఫాంపై దరఖాస్తు అందజేస్తే వారికి అవసరమైన సేవలన్నింటికి సింగిల్ విండోలో అనుమతి లభించేలా ఉండాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పురపాలక, జలవనరులు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ తదితర విభా గాలు సంయుక్తంగా పనిచేయాలని సూచించారు.

ఆయా శాఖలు వసూలు చేసే బిల్లుల సైతం ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానం ఉండా లన్నారు. వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని ఆయా విభాగాల ఖాతాల్లో జమ అయ్యే విధానాన్ని రూపొందించాలన్నారు.

లైడార్ సర్వేతో వనరుల మ్యాపింగ్..  

ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్ సర్వే చేయాలని, మరింత సులభతర విధానాల అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. పౌరసేవలు మెరుగ్గా అందేందుకుగానూ వివిధ శాఖల విభజనలో ఏకరూపత ఉండాలని, అనుమతుల ప్రక్రియలో అనవసరమైన జాప్యం చేయకూడదని, ఏ కారణం లేకుం డా అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని సీఎం పేర్కొన్నారు.

ఏదైనా కారణం చేత అనుమతులకు ఆలస్యమైతే అందుకు కారణాలు ఏమిటో దరఖాస్తుదారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలో కూడా అధికారులే సూచించాలని సీఎం ఆదేశించారు.

ఈ  సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ర ్టపురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబ ర్తి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.