calender_icon.png 8 June, 2025 | 6:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆరుగురి మృతదేహాలు లభ్యం

08-06-2025 02:33:28 PM

హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీలో శనివారం సాయంత్రం ఈతకు వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతైన విషాయం తెలిసిందే. గల్లంతైనవారు అంబటిపల్లికి చెందిన పత్తి మధుసూధన్ (18), పత్తి శివ మనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్నాల సాగర్ (16), కొర్లకుంటకు చెందిన పాండు (18), రాహుల్ (19) మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మహాదేవపూర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతులందరికీ 20 ఏళ్లలోపు వయస్సు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ యువకులు అంబటిపల్లి గ్రామంలో జరిగిన ఓ కుటుంబ వివాహానికి హాజరయ్యారు. అంబటిపల్లి మరియు కొర్లకుంట గ్రామాల నుండి బంధువులు, ఎనిమిది మందితో కూడిన బృందం వారితో చేరారు, వీరితో పాటు మధ్య వయస్కుడైన పత్తి వెంకటస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నారు. సాయంత్రం 5:30 గంటలకు యువకులు ఈత కొట్టడానికి నదికి వెళ్లిన మృతి చెందిన ఆరుగురు యువకులతో పాటు మరికొంత మంది, మధ్య వయస్కుడైన పత్తి వెంకటస్వామి అనే వ్యక్తి ఉన్నాడు. ఈత కోట్టేందుకు నదిలోకి దిగారు. ఎగువను నుంచిన అధిక నీటి ప్రవాహం కారణంగా యువకులు నిటీలో మునిగిపోయారు. శివ అనే యువకుడు ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డాడు.

మధుసూధన్‌, మనోజ్‌ అన్నదమ్ములు, వారి తండ్రి పత్తి వెంకటస్వామి కళ్ల ముందు జరిగిన విషాదాన్ని చూశారు. యువకులు నీటిలో మునిగిపోవడం చూసిన వారు వెంటనే బ్యారేజ్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే, సహాయం అందే సమయానికి, ఆరుగురు యువకులు నీటిలో అదృశ్యమయ్యారు. ఆ యువకులను బయటకు తీసేందుకు అధికారలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు నిపుణులైన ఈతగాళ్లను మోహరించి, రాత్రి వరకు గాలింపు కొనసాగించడానికి ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. ఇటీవల ఎగువన కురుస్తున్న వర్షాలు బ్యారేజీ గేట్ల  తెరవడంతో బలమైన ప్రవాహం వచ్చిందన్నారు. విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పరిస్థితిని సమీక్షించి, సహయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.