08-06-2025 04:03:14 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5.45 గంలటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో గోపీనాథ్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుంది. మాగంటి అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పాడె మోశారు.