04-06-2025 12:18:51 AM
పోలీసుల అదుపులో 8 మంది, పరారీలో ముగ్గురు
నిజామాబాద్ జూన్ 3; (విజయ క్రాంతి): హైదరాబాద్ తో సహా వివిధ జిల్లాల్లో ని ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇటీవల నగర శివారులోని అర్సపల్లిలో జరిగిన భారీ దోపిడీ నుండి మొదలైన దర్యాప్తు ఈ ముఠాను చేరుకునే వరకు కొనసాగింది. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు పక్కా ప్లాన్ తో ఈ ముఠాలోని ఎనిమిది మంది దొంగలను పట్టుకున్నారు.
మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన వారి నుండి 15 తులాల బంగారు సొత్తు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఇటీవల నగర ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇల్లుని లక్ష్యంగా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న కేసులపై వివిధ బంధాలచే విచారణ ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వెళ్లడైన విషయాలను బట్టి హైదరాబాదుకు చెందిన మహమ్మద్ అమీర్ అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలువురి నీ పరిచయం చేసుకొని చోరీలకు పాల్పడుతూ ఉన్నట్లు సిసి పుట్టే జిల్లా ఆధారంగా మహమ్మద్ అమీర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా వరుస దోపిడీలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయని సిపి సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో 8 మంది దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ ముఠా హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో 24 దొంగతనాల సంఘటనలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు నిజామాబాద్ జిల్లాలోనే 20 కి పైగా దొంగతనాలు చేసినట్లు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
దోచుకున్న అనంతరం వచ్చిన సొత్తును షేక్ వసీంకు ఇచ్చేవారని ఆయన తనకు పరిచయం ఉన్న మల్కాపూర్ కు చెందిన మోహన్ కు అమ్మేవాడని అలా వచ్చిన నగదును అందరూ కలిసి పంచుకునే వారని సిపి తెలిపారు అరెస్ట్ అయిన వారిలో మొహమ్మద్ అమీర్ తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ అబ్దుల్ షేక్ వాసిన్ నయాత్ రియాజ్ జావేద్ ఖాన్ షేక్ సోహెల్ ఎండి ఆసిఫ్ మాలోతు మోహన్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించేమని పోలీసులు తెలిపారు.
పరారీలో ఉన్న ఈ ముఠాలోని మరో ముగ్గురు నిందితుల గురించి గాలింపు చర్యలు చేపట్టామని పోలీసు లు వెల్లడించారు. ఈ ముఠాలోని షేక్ సోహెల్ గతంలో ఏడు కేసులలో నిందితుడిగా ఉన్నాడని ఇతనిపై హత్య కేసు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠాంలోని మరో సభ్యుడు మహమ్మద్ మీర్ 21 కేసులలో నిందితుడుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి హైదరాబాద్ ప్రాంతాలలో మొత్తం 39 దోపిడి కేసులు ఈ ముఠా పై నమోదైనట్టు సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు.
నిందితుల నుండి 15 తులాల బంగారం గొలుసులు ఒక షిఫ్ట్ డిజైర్ కారు పల్సర్ బైక్ హోండా షైన్ బైక్ ఫ్యాషన్ ప్లస్ బైక్ లను స్వాధీనం పరుచుకున్నట్టు సిపి తెలిపారు దొంగల ముఠా నుండి చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ ఆరో టౌన్ ఎస్త్స్ర వెంకట్రావు తదితర సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ శాఖ కమిషనర్ సాయి చైతన్య అభినందిస్తూ క్యాష్ రివార్డును వారికి బహుకరించారు.