13-06-2025 12:14:01 AM
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో గురువా రం బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బడుగులకు ప్రాధాన్యమివ్వడంపై బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న మహేష్గౌడ్ను అభినందించి, శాలువాతో సన్మానించారు.
బీసీల కు ప్రాధాన్యత శాఖలు, సమాచార కమిషనర్లుగా అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. ఈ సందర్భం గా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులుగా మహేశ్గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్లో బడుగులకు న్యాయం చేసే దిశలో ఆలోచిస్తున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ర్టంలో కులగణన, కాంగ్రెస్ పార్టీలో బడుగులకు ప్రాధాన్యం దక్కడంలో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో వందకు వందశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళకు కట్టబెట్టడం, రెండోసారి మంత్రివర్గ విస్తరణలోనూ ఇదే ఒరవడిలో కొనసాగించ డం గొప్పవిషయమని కొనియాడారు.
పీసీసీ చీఫ్ను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి, కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్, కోఆర్డినేటర్ ఉప్పరి శేఖర్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, బీసీ నేతలు జాజుల లింగంగౌడ్, ఐలీ వెంకన్న, సింగం నగే శ్, శంకరాచారి, నిద్ర సంపత్, దుర్గయ్య, బండి గారి వెంకన్న గౌడ్, భరత్ ఉన్నారు.