calender_icon.png 14 June, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

13-06-2025 12:15:51 AM

  1. ప్రతి ఒక్కరికి చదువువే పునాది

ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలాంటివి

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల సదుపాయాలు

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

లక్షెట్టిపేట, జూన్ 12: విద్యా రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల భవనాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, డీసీపీ భాస్కర్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయ తీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు మాట్లాడుతూ..... ప్రభుత్వ ఉన్నత పాఠశాల- జూనియర్ కళాశాల భవన నిర్మాణం ఇంత త్వరగా పూర్తి కావడంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించిందని, 10 నెలల కాలంలో భవన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి చదువు అనేది పునాది వంటిదని, ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాల వంటివని, ఇక్కడ చదివే విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు విలువలు బోధించబడతాయని, సమాజ సేవ అలవడుతుందని అన్నారు.

ప్రపంచంలోనే యువత అధిక మొత్తంలో ఉన్న దేశం మనదేనని, సరిగ్గా వినియోగించుకుంటే ప్రపం చంలోనే అత్యున్నత శక్తిగా ఎదుగుతామన్నా రు. అతి తక్కువ కాలంలో పనులు చేపట్టి పూర్తి చేసిన మహా ప్రస్థానం, డా బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ స్థాపనతో పాటు ఈ భవన నిర్మాణం నిలిచిపోతుందని అన్నారు. 

ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలలో అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, భావి తరాలకు మంచి భవిష్యత్ అందించాలనే లక్ష్యంతో ఆలోచించి తాను చదివిన పాఠశాల, కళాశాల నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. నిబద్దత, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు వెళితే ఏదైనా సాధ్యమేనని, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు.

జిల్లాలో 283 పాఠశాలలలో అభివృ ద్ధి పనులు చేపట్టడం జరిగిందని, గత సంవత్సరం 4 వేల 800 మంది విద్యార్థులు అద నంగా విద్య అభ్యసించారని తెలిపారు. ప్రభు త్వం విద్యార్థుల కొరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు కృషి చేస్తుందని తెలిపారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని, విద్యా రంగంలో జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్.ఎస్. సి., ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.