26-01-2026 07:31:02 PM
ఉప్పల్,(విజయక్రాంతి): 26 వేలకే పాత కార్లు మీ సొంతం అంటూ ఓ వ్యాపారి చేసిన ప్రకటన ఉద్రిక్తత పరిస్థితికి దారి చేసింది. సినిమా స్టైల్ లో చేసిన ప్రకటన ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ వచ్చింది. ఉదయాన్నే 26,000 పట్టుకొని కార్ల షోరూమ్ కి క్యూ కట్టారు ప్రజలు తీరా అక్కడికి వెళ్లాక ఆ వ్యాపారి కారు లేవు చెప్పడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు అక్కడ ఉన్న కార్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. పోలీస్ రంగ ప్రవేశంతో ఆ వ్యాపారిని అరెస్టు చేశారు. పోలీసులు. వివరాల్లోకెళ్తే.. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రోషన్ అనే వ్యక్తి ట్రస్ట్ కార్డ్స్ పేరుతో నాచారంలో సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మకాలు కొనుగోలు చేసేవాడు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్స్టా వంటి గ్రూపులలో తమ వద్ద 26 వేలకే కారులు ఉన్నాయంటూ రిపబ్లిక్ డే స్పెషల్ అంటూ విస్తృతప్రచారం చేసుకున్నారు. ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల కున్న డిమాండ్ దుష్ట ఈ ప్రకట కాస్త నెట్టెడ్ వైరల్ గా మారడంతో అతి తక్కువ ధరకే కారు దొరుకుతున్న ఆశతో తెల్లవారుజామునే రోషన్ షో రూమ్ వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తీరా షాప్ తెర్చన తర్వాత కార్ల గురించి అడగ కార్లు లేవంటూ సిబ్బంది రోషన్ సమాధానం ఇచ్చారు.
సిబ్బంది రోషన్ మాటలకు తీవ్రంగా అవగాహన గురైన ప్రజలు తమ మోసపోయామంటూ గంటలకొంది కార్ల కోసం వేసి చూస్తే తమకు రోషన్ తప్పుదోవ పట్టించాడంటూ రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రికంగా మారడంతో నాచారం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రకటన ఇచ్చి ప్రజలను మోసపూరితగా తప్పుదోవ పట్టించిన రోషన్ పై కేసు నమోదు చేసినట్లు నాచారం ఇన్స్పెక్టర్ ధనంజయ గౌడ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాల వచ్చే ప్రకటన పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు