calender_icon.png 26 January, 2026 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసినమర్రిగూడ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -1

26-01-2026 07:35:17 PM

యువత లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి..

క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయం ఖాయం

విద్యా, క్రీడా రంగాల్లో యువతను ప్రోత్సహించడమే నా లక్ష్యం

సర్పంచ్  వల్లంల సంతోష్ యాదవ్.  

మర్రిగూడ,(విజయక్రాంతి): యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే విజయం తప్పకుండా దరిచేరుతుందని యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి 16 టీములు యరగండ్లపల్లిలో  శ్రీ ముత్యాలమ్మ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి మర్రిగూడ మండల స్థాయి  క్రికెట్ టోర్నమెంట్ సీజన్-1ను నిర్వహించారు.

సోమవారం  సాయంత్రం ఫైనల్ మ్యాచ్ ముగియడంతో సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ విజేతలకు నగదు తో పాటు ట్రోఫీలను అందజేశారు. ప్రథమ బహుమతి కింద యరగండ్లపల్లి టీమ్ కు రూ.25,000, ద్వితీయ బహుమతి మర్రిగూడ టీమ్ కు రూ. 15,000, నగదు తో పాటు ట్రోఫీలను ఆయన అందజేశారు. టోర్నమెంట్ లో పాల్గొన్న మిగతా టీమ్ లకు ప్రోత్సాహక బహుమతులను, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రత్యేక బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ మాట్లాడుతూ... యువతను విద్య, క్రీడా రంగాల్లో ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నానని గ్రామంలోని యువతీ యువకులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా యువతకు కావలసిన మెటీరియల్ ను అందిస్తానని హామీ ఇచ్చారు.రాజకీయంగా, ఉద్యోగాలపరంగా ఎదిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలోఆయా గ్రామాలపెద్దలు ,నాయకులు ,వార్డ్ మెంబెర్స్ , ఆర్గనైజర్ లు, యువకులు పాల్గొన్నారు.