calender_icon.png 9 June, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

09-06-2025 12:26:15 AM

  1. కలెక్టర్ ఆదేశాలను పాటించ కుండా... పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా
  2. జిల్లాలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

పెద్దపల్లి మార్చి 18విజయ క్రాంతి)  పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా డాన్ లు రేచ్చిపోతున్నారు. జిల్లాలో సహజ  వనరులైన మేట వేసిన ఇసుక, సన్నటి ఎర్ర ఇసుక, దు బ్బ, మట్టి, మొరం అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇంకేముంది ఈ మట్టి మాఫియా గాళ్లు కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండలతో చూస్తుండగానే కోట్ల కు పడుగెత్తుతున్నారు. దీంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

జిల్లా లోని గుట్టలను, మానేరు వాగులో ఇసుకను, అట వీ భూముల నుండి,  ప్రభుత్వ పట్టా భూ ముల నుండి సహజ వనరులను  ఎటువం టి అనుమతి లేకుండానే రాత్రి, పగలు తేడాలేకుండా దొసుకుంటూ...ప్రభుత్వ ఆదాయా నికి గండి కొడుతున్నారు. జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, అంతర్గాం తో పాటు త దితర మండలాలలోని గ్రామాలలోని చెరువులలో ప్రొక్లెయినర్లు, జేసీ బీ లతో త్రవ్వకాలు చేపడుతూ టిప్పర్లు, ట్రా క్టర్లతో  అక్రమంగా మట్టి తరలిస్తూ  అందిన కాడికి జేబులు నింపుకుంటున్నారు.

సామా న్య ప్రజలు మాత్రం  సొంత అవసరాల కో సం మట్టి, మొరం, ఇసుక తీసుకునేందుకు తహసీల్దార్‌లు అనుమతి మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  ఫిబ్రవరి 10వ తేదీన జిల్లాలోని తహసీల్దార్ లకు ఆదేశాల జారీ చేశారు. ఒక ట్రాక్టర్ కు రూ. 200 రూపాయలు, టిప్పర్ కు రూ. 800 రూపాయల రుసుము తహసిల్దార్ లకు చెల్లించిన తరువాత అనుమతి పొందాలని, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మట్టి  తరలించాలని, ఆదివారం, సెలవు దినాలలో మట్టి తరలింపుకు అనుమతి లేదని,  నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశా లు  జారీ చేశారు.

అయినప్పటికీ, మాఫియా గాళ్లు అక్రమంగా సన్నటి ఇసుక, ఎర్ర మట్టి, మొరం దందా మాత్రం మూడు పువ్వులు ఆ రు కాయలుగా కొనసాగుతోందని, ఈ అక్ర మ మట్టి దందా నిర్వహించే అక్రమార్కుల ను మాత్రం సంబంధిత శాఖలు అరికట్టడంలేదన్న విమర్శలు ఉన్నాయి. కలెక్టర్ ఆదేశా లు అమలు చేయడంలో సంబంధిత శాఖల అధికారులు విఫలం అవుతున్నారు.   

ప్రభుత్వానికి ఎటువంటి సీనరేజ్ ఛార్జీలు చెల్లించ కుండా, ప్రభుత్వం ఆదాయానికి గండి కొ డుతూ, అక్రమ మట్టి దందా నిర్వహిస్తున్నారని, ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.  ఈ అక్రమ మట్టి జోరుగా కొనసాగుతుందని, సెలవు దినాలైనా శనివా రం, ఆదివారం లతో పాటు ప్రభుత్వ సెలవు దినాలలో పగలు, రాత్రి  అనకుండా అక్రమ మట్టి దందా నిర్వహిస్తున్నారు. సంబంధిత శాఖలు స్పందిచకపోవడంతో అనుమానా లు రేఖ ఎత్తుతున్నాయి.

ప్రభుత్వం లోని బా ధ్యతాయుతమైన ఓకీలక శాఖ మాత్రం తమ శాఖకు సంబంధించింది కాదని చేతు లు దులిపి వేసుకుంటున్నారు. కనీసం ఎవరైనా పౌరులు ఫోన్ లో గాని సంబంధిత శాఖల కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్ర జలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమ శాఖ అధికారులు తమ శాఖలో తగినంత స్టాఫ్ లేదని, ఒక ఫీల్ వద్దకు వెళ్లినా తమకు సె క్యూరిటి లేదని, రక్షణ లేదని పలువురు మండల స్థాయి అధికారులు పాత్రికేయులకే చెప్తున్నారు. 

అక్రమ మట్టి తరలింపుపై సం బంధిత శాఖల అధికారులకు ఫోన్ చేస్తే, స్పందించడం లేదనే విమర్శలున్నాయి. అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే స్పం దించి, చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్  సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేయాలని జిల్లాప్రజలు కోరుతున్నారు.