calender_icon.png 9 June, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేప మందు మూఢ నమ్మకం

09-06-2025 12:30:15 AM

రిటైర్డ్ కర్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి

జనగామ, జూన్ 8 (విజయక్రాంతి): చేప మందుతో అస్తమా తగ్గుతుందనేది పచ్చి బూటకమని రిటైర్డ్ కర్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ పై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం జనగామలో ఆయన మాట్లాడారు. ఆధునికంగా, సాంకేతికంగా భారతదేశం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆశాస్త్రీయ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అసమాకు అలోపతిలో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆశాస్త్రియ విధానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. చేప మందు పంపిణీలో బ్రీడ్ , నీరు ఎలాంటివి వాడుతున్నారో తెలియదని, దానికి ఒక ఫార్ములా అంటూ లేదని స్పష్టం చేశారు.

ఒకవేళ దానితో ప్రయోజనం ఉంటే ఏడాదికి ఒకేసారి కాకుండా నిత్యం అందుబాటులో ఉంచ వచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు.  సరైన రుజువు లేని చేప మందు పంపిణీకి ప్రభుత్వం ఏకంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.